Friday, September 20, 2024

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Jagga Reddy Says Thanks To CM KCR

 

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల తరుపున సిఎం కెసిఆర్‌కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెండు లక్షల 36 వేల మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మినిమమ్ మార్కులతో పాస్ చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గత పదిరోజుల నుండి విద్యార్థలు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలగించారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా పోరాడిన ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, ఆర్గనైజేషన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ పోరాటంలో మీడియా పాత్రను కూడా ఆయన ప్రస్తుతించారు. ప్రభుత్వం చెప్పినట్లు విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా చదువుకోండని అన్నారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన ప్రకటించిన ఇంటర్‌బోర్డు ముట్టడిని విరమించుకుంటున్నామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News