Wednesday, July 3, 2024

బలవంతంగా కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి నేను చిన్న పిల్లాడిని కాను: పోచారం

- Advertisement -
- Advertisement -

బలవంతంగా తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి తాను చిన్న పిల్లాడిని కానని, రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం దిశగా సిఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని పోచారం కొనియాడారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నానన్నారు.

తన ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో అని, సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో చేరిక వెనుక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమీ లేదని, మంచి ఆలోచనలతో సిఎం ఆహ్వానించారని, అందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని పోచారం తెలిపారు. ప్రగతి కోసం కలిసి ముందడుగు వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని, పనిచేసే నాయకత్వాన్ని సమర్ధించేందుకే రేవంత్‌కు మద్ధతిస్తున్నానని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పోచారం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News