Friday, September 20, 2024

సాయిచంద్‌కు ఎమ్మెల్యే సండ్ర నివాళి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వి. సాయిచంద్ హఠాన్మరణం పట్ల సంతాపాన్ని తెలుపుతూ సత్తుపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరావు, ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షులు వనమా వాసు, మట్ట ప్రసాద్, టీవీ మోహన్ రావు, భాస్కర్ రావు, గోట్టిపళ్ళ మోహన్ రావు, తెరాస యూత్ నాయకులు వల్లభనేని పవన్, అద్దంకి అనిల్, చింతల సత్యనారాయణ, షేక్ రఫీ, రఘు, నాగుల్‌మీర, గఫార్, కంటే అప్పారావుతో పాటు అధిక సంఖ్యలో టిఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News