- Advertisement -
నకిరేకల్: ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. సామాన్యులకే కాదు సెలమబ్రిటీలే కూడా ఈ మోసాలకు బలి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వేముల విరేశం కూడా సైబర్ మోసం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వీరేశంకి నిందితులు నగ్నంగా వీడియో కాల్ చేశారు. అనంతరం దాన్ని రికార్డు చేసి చేసి ఎమ్మెల్యే నెంబర్కి పంపించారు. డబ్బులు పంపకపోతే.. వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తానని బెదింపులకు పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఈ సమస్య నుంచి బయటపడ్డరు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -