Sunday, September 22, 2024

సిఎం కెసిఆర్ ఆశీస్సులు తీసుకున్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha taken blessings from CM KCR

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచిన కల్వకుంట్ల కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అశీస్సులు తీసుకున్నారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలుబడిన అనంతరం నిజామాబాద్ నుంచి నేరుగా కల్వకుంట్ల కవిత ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. కవితతో పాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సిఎం కెసిఆర్‌ను కలిశారు. అనంతరం కవిత కొద్దిసేపు సిఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు. నిజమాబాద్‌లో జరిగిన ఎన్నికల తీరు. ఎన్నికల ఫలితాలు, విపక్షాలు చేసిన ఆరోపణలు, ప్రజల ఆశీస్సులపై ఈ సమావేశంలో చర్చించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News