Sunday, February 23, 2025

ఇక మోడీ ప్రధాని కాలేరు..ఇది నా గ్యారెంటీ

- Advertisement -
- Advertisement -

వారణాసిలో రాహుల్ గాంధీ జోస్యం

వారణాసి: నరేంద్ర మోడీ తదుపరి ప్రధాన మంత్రి కారని, ఇది తతాను ఇస్తున్న గ్యారెంటీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తూ మరోసారి పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఇక్కడ పోటీ ప్రధాన మంత్రి అభ్యర్థికి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు మధ్య ఉందని, అందుకే మోడీ తిరిగి ప్రధాని కాలేరని అన్నారు. తాను గ్యారెంటీగా చెబుతున్నానని, జూన్ 4 తర్వాత ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని రాహుల్ జోస్యం చెప్పారుర్రు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, అయితే అజయ్ రాయ్ విజేతగా నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ప్రసంగించారు. జూన్ 1న ఏడవ దశ ఎన్నికలలో వారణాసిలో పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News