Thursday, July 4, 2024

మరి కొద్ది క్షణాల్లో లోక్ సభలో సమాధానాలివ్వనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరి కొద్ది క్షణాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో సమాధానాలివ్వనున్నారు. అది సాయంత్రం 4.00 గంటల నుంచి.  మోడీ అధికార పక్షం నుంచి మూడో సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

రాహుల్ గాంధీ మంటలు పుట్టించే ప్రసంగం తరువాత మరునాడు(నేడు) మోడీ పార్లమెంటులో సమాధానాలు ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ 62 నిమిషాలపాటు మాట్లాడి అనేక విషయాలపై కాక పుట్టించారు. అది ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అధికార పక్షం నాయకులకు సహించలేనిదిగా ఉండింది.

రాహుల్ గాంధీ హిందూయిజాన్ని హింసతో ముడిపెడుతున్నారని బిజెపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చూద్దాం ప్రధాని ఎలా సమాధానం ఇస్తారో….

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News