Sunday, September 8, 2024

ఆ లోటుపాట్లపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేస్తాం: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆదివారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో పేదలకు అందించిన వారికే ప్రజలు పట్టం కట్టారన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మోడీ మీడియాతో ప్రసంగించారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని, కొత్త పార్లమెంటులో సుదీర్ఘ కాలం కార్యకలాపాలు జరుగుతాయని వివరించారు.

కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చు అని అన్నారు. లోటుపాట్లపై సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుందని మోడీ చెప్పారు. భారత్ మరింత పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, విపక్షాలను కలుపుకొని పోతామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కేంద్రంగా పార్లమెంట్లు విలసిల్లాలని కోరారు. వికసిత భారత్ మరింత పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. పార్లమెంటులో బిల్లులపై జరిగే చర్చల్లో విపక్షాలు పాల్గొన్నాలని సూచించారు. చర్చలు సజావుగా సాగకపోతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేరని, ఎన్నికల ఫలితాల ఆగ్రహం చర్చలపై ప్రభావం చూపకూడదన్నారు. పరాజయాన్ని స్వీకరించి సభ్యులు హుందాగా ప్రవర్తించాలని డిమాండ్ చేశారు. అప్పుడే సభ్యులను దేశం చూసే దృష్టి కోణం మారుతుందని మోడీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News