Tuesday, September 17, 2024

క్రికెటర్ సిరాజ్‌కు జుబ్లీహిల్స్ లో ఇంటిస్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  భారత క్రికెటర్ ముహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సిరాజ్ సభ్యుడు. క్రికెటర్‌కు హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌ లో రోడ్ నెం. 78లో 600 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

ఇటీవల టి20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత నగరానికి చేరుకున్న సిరాజ్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి టీమిండియా జెర్సీని బహూకరించారు. ఈ సందర్భంగా సిరాజ్‌కు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా ఇంటిస్థలం కేటాయిస్తూ జీవో జారీ చేశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News