Thursday, April 3, 2025

మణికొండలో తల్లి, కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను తల్లి అలివేలు (40), కూతురు లాస్య (14)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వారి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కుటుంబ కలహాలతోనే తల్లికూతురు బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News