హైదరాబాద్: అమ్మతనానికి మాయని మచ్చ, దంపతుల మధ్య వివాదం చెలరేగడంతో 14 రోజుల పసికందును కన్నతల్లి మూడో అంతస్తు పైనుంచి కిందపడేసిన సంఘటన హైదరాబాద్లోని సనత్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2016లో వేణుగోపాల్కు లావణ్య పెళ్లి జరిగింది. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. డెలివరీ కోసమని లావణ్య తన పుట్టింటికి ఫతేనగర్లోని నేతాజీనగర్కు వచ్చింది. భర్తతో ఉన్న గొడవలు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా కాన్పులో మగ శిశువుకు జన్మనిచ్చింది. లావణ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. భర్తపై కోపం తగ్గకపోవడంతో 14 రోజుల పసికందును మూడో అంతస్తు నుంచి కిందపడేయడంతో ఘటనా స్థలంలోనే పసికందు చనిపోయింది. స్థానికుల సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లి కర్కశత్వం… పసికందును భవనం పైనుంచి కింద పడేసి…
- Advertisement -
- Advertisement -
- Advertisement -