- Advertisement -
భోపాల్: దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఐదు నెలల వయసు గల కుమారుడిని ఓ తల్లి తగలబెట్టిన సంఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుఖేర్ బర్హీ గ్రామంలో గుడ్డి సింగ్ గోండ్, పుష్పారాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతుల మధ్య ఒక విషయంలో గొడవ జరగడంతో భర్త తన తల్లిదండ్రులను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గుడ్డి సింగ్ గోండ్ తన ఐదు నెలల కుమారుడు బట్టలో చుట్టి నిప్పు పెట్టింది. ఇంట్లో నుంచి మంటలు రావడంతో స్థానికులు వచ్చి కాలిపోయిన పసికందును స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో పసికందు మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. దంపతులిద్దరికి మానసిక సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
- Advertisement -