Friday, October 18, 2024

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కడప: పచ్చని ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం చిలకలూరిపేటలో తాజాగా చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి ఓ భార్య చెరువులో దూకింది. తనతో పాటు ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసుకున్నారు. ఆ కుటుంబలో తరుచూ తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. చెరువు దగ్గరకు వచ్చిన స్థానికులు ఒడ్డున చెప్పులు, సెల్ ఫోన్ ఉండడం గమనించారు. అంతే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News