కథానాయకుడు సంపూర్ణేష్ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మోహన్ మేనంపల్లి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్టైన్చేయడానికి థియేటర్స్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్, కల్ట్ నిర్మాత ఎస్కేఎస్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి రాజేష్ మాట్లాడుతూ “సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. హృదయకాలేయం సూపర్హిట్ తరువాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు.
సంపూ నా దృష్టిలో స్టార్. ఈ సినిమా సంపూ కెరీర్లో మంచి విజయం సాధించాలి”అని అన్నారు. సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ “అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వఛ్చమైన కథ సోదరా. నేను రియల్లైఫ్లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది. అందరూ ఈ సినిమాను ఆదరించి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. హీరో సంజోష్ మాట్లాడుతూ “అన్నదమ్ముల బంధం విలువ చెప్పే సినిమా ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది. భవిష్యత్లో కూడా సంపూ అన్నతో పనిచేయాలని ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు మోహన్, మోహన్ మైనంపల్లి, కృష్ణ చైతన్య, చైతన్య, నవీన్ మేడారం, జాన్, శివ, పూర్ణాచారి, ఆర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు.