Tuesday, September 17, 2024

శ్రీహరికి హరిత కానుక

- Advertisement -
- Advertisement -

MP Joginapally Santosh Kumar who planted plant at Tirupati

 

మొక్కను నాటి తిరుపతి వెంకన్న మొక్కును తీర్చుకున్న

ఎంపి.జోగినపల్లి సంతోష్ కుమార్

మనెలంగాణ/హైదరాబాద్: దైవాంశ సంభూతమైన ప్రకృతికోసం ఆ దేవదేవుని సన్నిధిలోనూ పరితపిస్తున్నారు, అంతా శ్రీహరి మయం,ఈ జగమంతా హరితమయం మని ధ్యానిస్తున్నారు ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్. పదికాలాలపాటు పచ్చగా ఉండాలని సల్లగా బతకాలని దీవించే ఏడుకొండల దేవుడు కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో బుధవారం మొక్కకు జీవం పోసి ఈ విశ్వానికి దైవ చింతనతో పాటు ప్రకృతి చింతనను ప్రభోధించారు హరిత రుషి ఎంపి సంతోష్‌కుమార్. లోకాలనేలే శ్రీహరి దర్శనానంతరం హరితాన్నే ఆస్వామికి కానుకగా సమర్పించుకున్నారు. పచ్చని మొక్కను నాటి తనమొక్కును తీర్చుకున్నారు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ సందర్భంగా తిరుపతిలో సహచర మిత్రులు ఎంఎల్‌సి నవీన్‌రావు,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నమనేని శ్రీనివాస రావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News