Sunday, September 8, 2024

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన ‘మిస్టర్ బచ్చన్’ టీమ్

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్‌గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ముగించుకుంది. కీలక షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర బృందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కలిగి ఉన్న వీడియోను మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ ఎప్పటిలాగే శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు.

జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిగిలిన నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News