Wednesday, September 18, 2024

మీడియా రంగంలోకి నాగ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, జనసేన నేత అయిన నాగబాబు ‘ఎన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్’ పేరుతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. అందుకు కొత్తగా ఓ ఆఫీసును కూడా తెరిచారు. నాగబాబు భార్య, కూతురు నిహారిక ఈ కొత్త ఆఫీసును ఓపెన్ చేశారు. ప్రస్తుతానికైతే ఎన్ మీడియాను యూట్యూబ్ ఛానెల్ ద్వారా నడిపించనున్నారు. ప్రస్తుతానికి ఎంటర్ టైన్మెంట్, భక్తి, హెల్త్, ఇంటర్వ్యూ కంటెంట్లను అందించనున్నారు. కానీ త్వరలో రాజకీయ వార్తలు కూడా అందించనున్నట్లు వారి ప్రమో ద్వారా తెలిసింది. ఇదివరలో కూడా నాగబాబు ‘అంతా నా ఇష్టం’, ‘నాగబాబు ఛానెల్’ సహా అనేక యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహించారు.

N Channel

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News