Saturday, September 21, 2024

నాగార్జున సాగర్‌ 20 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్‌ జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. దీంతో సాగర్‌ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయంలోనికి ఇన్‌ఫ్లో 3,20,352 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో కూడా అంతే క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.50 అడుగులకు చేరుకుంది. నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 11,121 క్యూసెక్కులు నీరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News