Saturday, April 26, 2025

పొన్నవోలు ఆ వ్యాఖ్యలు చేయడం దారుణం: నక్కా

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడాన్ని వైసిపి నేతలు సహించలేకపోతున్నారని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. బుధవారం నక్కా మీడియాతో మాట్లాడారు. బెయిల్ ఇచ్చి హైకోర్లు పరిధి దాటిందన్న ఎఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. స్కిల్ కేసు నిందితులంతా బయటే ఉన్నారని తెలియదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వైసిపికి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాధనాన్ని దున్వినియోగం చేసేలా ప్రభుత్వం వైఖరి ఉందని, ఎఎజిలా కాకుండా జగన్ ఏజెంట్‌లా పొన్నవోలు మాట్లాడారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News