Tuesday, September 17, 2024

నల్లగొండలో తల్లిని కత్తితో పొడిచి చంపి…. కుమారుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తల్లిని కత్తితో పొడిచి చంపి అనంతరం కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శివ తన తల్లి సాయమ్మతో కలిసి ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి తల్లి, కుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిని కుమారుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం కుమారుడు గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News