నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ 4కె డిజిటలైజేషన్, 5.1 సౌండ్తో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఆదివారం ఉగాది రోజున నందమూరి బాలకృష్ణ తో సహా చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్లో రీ- రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “నందమూరి బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో అలరించి, మా సంస్థకి భారీ విజయాన్ని, చిరస్మరణీయ గుర్తింపుని అందించిన ‘ఆదిత్య 369‘ చిత్రాన్ని ఏప్రిల్ 4న రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా సమక్షంలో ఈ ఉగాదికి రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు”అని అన్నారు.
ఉగాది రోజున ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్ ఫంక్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -