Monday, April 28, 2025

నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగరాని గుండ్ల గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ముని, ప్రభాకర్, దశరతగా గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News