Sunday, September 8, 2024

కంటతడి పెట్టుకున్న నారా లోకేష్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్త సమావేశంలో నారా లోకేష్ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అనవసరంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిపై తన నిరాశను పంచుకున్నారు. తొలిసారి లోకేష్ మీడియా ముందు విరుచుకుపడ్డారు. ప్రజాసంక్షేమం కోసం పోరాడి, ఎలాంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడును అన్యాయంగా ఎలా జైలులో పెట్టారని లోకేశ్ ప్రశ్నించారు.

చంద్రబాబు ఆస్తులన్నీ బయటపెట్టారని, ఆస్తులు కూడబెట్టుకునేందుకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రజలకు అందించిన ఉపాధి అవకాశాలు, ప్రయోజనాలను లోకేష్ ఎత్తిచూపారు. వారి సంక్షేమం కోసం కృషి చేయడంలో అంకితభావంతో పనిచేశారని చెప్పుకొచ్చారు. నేడు చంద్రబాబు కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు రేపు ఏ కుటుంబాన్ని అయినా ప్రభావితం చేసే అవకాశం ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వారి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని విభజించి అమ్ముడుపోకుండా అడ్డుకోవడంలో టిడిపి-జనసేన పొత్తు కీలకమని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు వస్తాయని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలను కన్నతండ్రిలా అనుక్షణమూ కాపాడుకున్న ప్రజా నాయకుడిని… కక్షగట్టి, ఏ నేరమూ చేయకపోయినా అవినీతిపరుడంటూ నిందలేసి, జైలు పాలు చేస్తే… తెలుగువారందరి మనసుల్లో గూడు కట్టుకున్న బాధ… ఈరోజు నారా లోకేష్ కంట్లో కన్నీరై బయటకు వచ్చింది. అది లావాగా మారేరోజు మరెంతో దూరం లేదని టిడిపి కార్యకర్తలు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News