Monday, April 21, 2025

కాసేపట్లో ఎపికి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహిస్తున్నారు. ఏపీ పర్యటనకు వెళ్తున్నానంటూ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి సభలో ప్రసంగిస్తానంటూ మోడీ ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ మోడీ తెలిపారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్‌ కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News