Wednesday, September 18, 2024

నేషనల్ అవార్డు రావడంతో ఆనందంగా ఉంది

- Advertisement -
- Advertisement -

కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థకు మైల్ స్టోన్ మూమెంట్’అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కార్తికేయ2’. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది ‘కార్తికేయ2’. ఈ నేపధ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ2 చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం మా సంస్థ పీపుల్ మీడియాఫ్యాక్టరీకి మైల్ స్టోన్ మూమెంట్.

ఇది మా మొదటి నేషనల్ అవార్డ్. మా అభిషేక్‌కి సెకండ్ నేషనల్ అవార్డ్. ఈ సందర్భంగా నిఖి కి థాంక్స్ చెబుతున్నాను. నిఖిల్ మాకు డైరెక్టర్ చందూ మొండేటితో పరిచయం చేశారు. అభిషేక్, మేము కలసి చేసిన సినిమా ‘కార్తికేయ2’. మేము మొదలుపెట్టినప్పుడే పెద్ద సినిమా అనుకున్నాం. కానీ ఇంత సక్సెస్ వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా పాన్ ఇండియాలో మాస్ ఆడియన్స్ అద్భుతంగా ఆదరించారు. ఈ రోజు మైల్ స్టోన్ నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా వుంది. మా సంస్థకు ఇది చాలా గొప్ప విషయం. కార్తికేయ3 తప్పకుండా వుంటుంది’ అని అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కృష్ణ ఈజ్ ట్రూత్.

ఈ రోజు మరోసారి ఇది నిరూపించబడింది. ఈ అవార్డ్ కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను.నిఖిల్, చందూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వారితో మా కొలాబరేషన్ కొనసాగుతుంది’ అని తెలిపారు. డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘కార్తికేయ2’ అద్భుత విజయం సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యామో ఇప్పుడు అదే ఫీలింగ్‌లో వున్నాం. నేషనల్ అవార్డ్ మరింత భాద్యతని పెంచింది. కార్తికేయ3 ప్రస్తుతం రైటింగ్‌లో ఉంది. కార్తికేయ2 తర్వాత దానిపై అంచనాలు ఎంతలా పెరిగాయో మాకు తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా కార్తికేయ3 వుంటుంది. నేషనల్ అవార్డ్ రావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News