Tuesday, September 17, 2024

కూలిన నేపాల్ హెలికాప్టర్…ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. హెలికాప్టర్ ఖాట్మండు నుంచి బయలుదేరి సయాఫ్రూబెన్సికి వెళ్తోందని స్థానిక మీడియా తెలిపింది.

హెలికాప్టర్‌ను సీనియర్ కెప్టెన్ అరుణ్ మల్లా పైలట్ చేశారు ,  టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే గ్రౌండ్ స్టాఫ్‌తో సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్ టేకాఫ్ అయినప్పుడు అందులో నలుగురు చైనా జాతీయులు ,  పైలట్‌ సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. చైనా జాతీయులు రాసువాకు వెళ్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

బుధవారం మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్లు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA)లోని సోస్‌లను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. సూర్య చౌర్‌కు చేరుకున్న తర్వాత 1:57 సమయంలో హెలికాప్టర్ అధికారులతో సంబంధాలు కోల్పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News