Thursday, August 29, 2024

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నేరెళ్ల శారద

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మహిళా హక్కుల కార్యకర్త నేరెళ్ల శారద బుద్ద భవన్‌లో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క నేరెళ్ళ శారదకి శాలువా కప్పి అభినందనలు తెలిపారు. తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జూలై 12న విడుదల చేసిన జీవోలో కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్న శారదను ఆమెకు ముందున్న సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా సమర్పించడంతో చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

సునీతా లక్ష్మా రెడ్డి 2021 జనవరి 8న మహిళా కమిషన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పదవీకాలం సాధారణంగా జనవరి 7, 2026 వరకు ఉంది. కానీ తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొంటూ ఆమె పదవికి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News