Tuesday, September 10, 2024

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం: రామ్మోహన్ నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్‌లో భాగంగా 10 కె రన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయానికి చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని, అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారంటూ విమర్శలు చేశారని, బాబు దూరదృష్టితోనే అంతర్జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయానికి పేరు వచ్చిందని ప్రశంసించారు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిఎం మోడీ పిలుపునిచ్చారని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రామ్మోహన్ నాయుడు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News