Thursday, April 24, 2025

కంటి ఆసుపత్రికి నూతన పరికరం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కంటి ఆసుపత్రికి కొన్న నూతన పరికరాన్ని ప్రారంభించారు. ఈ పరికరం వల్ల గ్లకోమా రోగులకు పరీక్షల కొరకు ఉపయోగిస్తారు. మంత్రి ఆసుపత్రి మొత్తం కలియతిరిగి జరుగుతున్న పలు కార్యక్రమాలను చూసి అభినందించారు.

చైర్మన్ కొండ వేణుమూర్తి మాట్లాడుతూ కట్రాక్టు ఆపరేషన్లు కాకుండా రెటిన, గ్లకోమ, మెల్లకన్ను సేవలను ఉపయోగించుకోవాలని, గ్రామాల్లో నేత్ర పరీక్ష శిబిరాలు నిర్ధారించడానికి ప్రజల ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిదుర సురేష్, ట్రస్టు బోర్టు సభ్యులు డాక్టర్ మురళీధర్‌రావు, కోల అన్నారెడ్డి, నగర మేయర్ సునీల్‌రావు, చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News