Sunday, September 8, 2024

తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

- Advertisement -
- Advertisement -

ముంబై: వన్డే ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 30 పరుగుల వద్ద కాన్వే(13)ఔట్ అయ్యాడు. బౌలింగ్ వేసిన తొలి బంతికే మహ్మదద్ షమి వికెట్ తీశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్ ఉంచింది. 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ గెలవాలంటే న్యూజిలాండ్ కి 363 పరుగులు చేయాల్సిఉంది. ప్రస్తుతం 6 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది న్యూజిల్యాండ్. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (9),కేన్ విలియమ్సన్ (4) ఉన్నారు. ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును అధిగమించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News