Friday, March 21, 2025

రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

- Advertisement -
- Advertisement -

ద్రోణి కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

-ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు : వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురందించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ద్రోణి ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వివరించారు.

తెలంగాణకు వడగండ్ల వాన సూచన : తెలంగాణలో గత కొద్దిరోజులుగా భానుడు ప్రతాపం చూపించగా శుక్ర, శనివారాల్లో మాత్రం ఎండలు కాస్త తగ్గుముఖం పట్టనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురనున్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే గత పదిరోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగగా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. రానున్న రెండు రోజులపాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News