Tuesday, September 17, 2024

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీ స్టాక్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 13.65 పాయింట్లు లేక 0.02 శాతం పెరిగి 81711.76 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 7.20 పాయింట్లు లేక 0.03 శాతం పెరిగి 25017.80 వద్ద ముగిసింది.  దాదాపు 2036 షేర్లు పెరుగగా, 1746 షేర్లు పతనమయ్యాయి. 86 షేర్లు యథాతథంగా ముగిశాయి.

మార్కెట్ యాంగ్జయిటీని కొలిచే ఇండియా విక్స్ 1 శాతం పతనమై 14 వద్ద ముగిసింది. నిప్టీలో ఎల్ అండ్ టి, ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఫిన్ సర్వీస్, హెచ్ డిఎఫ్ సి లైఫ్ ప్రధానంగా లాభపడగా, హెచ్ యూఎల్, జెఎస్ డబ్ల్యూ స్టీల్, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, ఎన్ టిపిసి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News