విభజనకు ముందు..తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ..
రాజ్యసభలో ప్రత్యేక ప్రకటన చేసిన కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ పార్టీని
తప్పుపట్టడం లేదని వ్యాఖ్య కేంద్ర బడ్జెట్లో
తెలంగాణకు సరైన ప్రాధాన్యం ఇచ్చామని
వివరణ ఏ రాష్ట్రం పట్ల మా ప్రభుత్వం
వివక్ష చూపడంలేదని స్పష్టీకరణ
మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్య వస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చే శారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేం ద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రా ష్ట్రం పట్ల వివక్ష చూపదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తు న్న విమర్శలపై ఆమె స్పందించారు. తెలంగా ణ మిగులు బ డ్జెట్ రాష్ట్రంగా ఉంటే ఇప్పుడు అప్పుల కుప్పగా మా ర్చార న్నారు. రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆ ర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని, కానీ ఇప్పుడు అది అప్పు ల కుప్పగా త యారైందని తెలిపారు. తాను ఏ పార్టీని తప్పు పట్టడం లేదని, ఇం దిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టే షన్ ఏర్పాటు చేసింది మోడీ ప్ర భుత్వం అని,
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎరువు ల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 ల క్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచామని, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీదేనన్నారు. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్ అన్నారు. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గుర్తు చేశారు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామ్ని, బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేశామని, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశామన్నారు.
రూ.5,337 కోట్ల రూపాయల బడ్జెట్ను రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు కేటాయించామని, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించామన్నారు. ఐదు కొత్త వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇవ్వడంతోపాటు 40 రైల్వే స్టేషన్లు రీడెవలప్ చేశామని స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 31 లక్షల టాయిలెట్లను స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించామన్నారు. జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చామని, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను ఇవ్వడంతోపాటు 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు చేశామని నిర్మాల సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు. బడ్జెట్లో బీహార్తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు.