Wednesday, October 16, 2024

రతన్ టాటా..”గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా”

- Advertisement -
- Advertisement -

అంబానీ కుటుంబం, రిలయన్స్ ఉద్యోగులు దివంగత ప్రముఖ పారిశ్రిమిక వేత్త రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో భాగంగా నీతా అంబానీ రతన్ టాటా గొప్పతనాన్ని , ఆయన దేశ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన గౌరవార్ధం అందరూ ఓ నిమిషం మౌనం పాటించాల్సిందిగా ఆమె కోరారు. రతన్ టాటా మా మావయ్య ధీరూభాయ్, నా భర్త ముకేష్ అంబానీకి,మా కుటుంబానికి మంచి స్నేహితుడుని ఆమె అన్నారు. నీతా అంబానీ “గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా” అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రిమికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి , ఆకాష్ అంబానీకి మార్గదర్శి రతన్ టాటా అని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News