Saturday, July 6, 2024

విమానం తరహాలో 132 సీట్ల బస్సు

- Advertisement -
- Advertisement -

కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని చెప్పారు. “ కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతి ప్రత్యామ్నాయం, కాలుష్య రహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. వందల సంఖ్యలో ఇథనాల్ పంపులు ఏర్పాటు కానున్నాయి. రూ. 120 లీటరు పెట్రోల్‌కు ఖర్చుపెట్టే బదులు రూ. 60తో ఇథనాల్ వాడొచ్చు. డీజిల్ బస్సు కి.మీ ప్రయాణానికి రూ. 115 ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు రూ. 50 నుంచి 60 అవుతుంది. దీంతో టికెట్ ధర 15 నుంచి 20 శాతం తగ్గుతుంది.” అని నితిన్‌గడ్కరీ వెల్లడించారు.

“ చెక్ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు , అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటం చూశాను . ఇక్కడ కూడా టాటా సహకారంతో నాగ్‌పూర్‌లో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టాం. మన ప్రాజెక్టు లోనూ 132 మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నాం. 40 కిమీ దూరం వెళ్లాక ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 40 సెకన్ల పాటు ఛార్జింగ్ చేస్తే మరో 40 కిమీ వెళ్లొచ్చు. దీంతో కి.మీ ఖర్చు రూ. 35 నుంచి రూ. 40 మాత్రమే అవుతుంది.” అని కేంద్ర మంత్రి తెలిపారు. “ ఈ బస్సులో విమానంలోలా సీటింగ్, ఏసీ, సీటు ముందు ల్యాప్‌టాప్ పెట్టుకొనే సౌలభ్యం ఉండాలని సూచించా. ఎయిర్ హోస్టెస్ మాదిరిగా పండ్లు, ప్యాక్ చేసిన ఆహారం శీతల పానీయాలు అందించేందుకు “బస్‌హోస్టెస్‌” అంటారు. డీజిల్ బస్సుతో పోలీస్తే దీని నిర్వహణకు 30 శాతం ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సోలార్ పవర్ వినియోగిస్తే ఈ ఖర్చు మరింత తగ్గుతుంది. ’ అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇలా దేశంలో కాలుష్య రహిత రవాణా సదుపాయాలని మరింత మెరుగుపరిచేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News