Tuesday, September 17, 2024

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే పెన్షన్ కట్

- Advertisement -
- Advertisement -

విప్లవాత్మక బిల్లును ఆమోదించిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ
అనర్హత వేటు పడిన ఎంఎల్‌ఎలకు వర్తింపు బిల్లును
ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సిఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలకు పింఛన్లు ఉండవు. ఈ కోత విధించే రీతిలో ఓ బిల్లును కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీకి వెళ్లే ఎమ్మెల్యేలకు పెన్షన్ సౌకర్యం లేకుండా చేసే ఈ బిల్లును సభ ఆమోదించింది. హిమాచల్ ప్రభుత్వం ఈ అసాధారణ బిల్లును తీసుకురావడం, ఆమోదింపచేసు కో వడం, ఫిరాయింపుల వ్యతిరేక ప్రక్రియలో కీలక ఘట్టం అయింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఈ బిల్లు వర్తిస్తుంది. వీరిపై వేటుపడుతుంది.

బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రవే శపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ( సభ్యుల అలవెన్స్‌లు,పెన్షన్లు)సవరణ బిల్లు2024 పేరిట దీనిని తీసుకువచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పరిధిలో ఏ దశలో అయినా సభ్యు లు అనర్హతకు గురైతే అటువంటి వ్యక్తి చట్టం పరిధి లో పెన్షన్, ఇతరత్రా అలవెన్స్‌లకు అర్హులు కారని ఈ బిల్లులో పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ నడు మ తరచూ అధికార మార్పిడి, ఈ క్రమంలో ఎమ్మె ల్యేల ఫిరాయింపులు జరిగే ఈ రాష్ట్రంలో ఈ బిల్లు అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరో ధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News