Thursday, April 10, 2025

చలాన్ల రాయితీ పొడిగింపు లేదు

- Advertisement -
- Advertisement -
No reduction in challan extension: Joint CP Ranganath
స్పష్టం చేసిన జాయింట్ సిపి రంగనాథ్

మనతెలంగాణ, సిటిబ్యూరోః ట్రాఫిక్ చలాన్ల రాయితీకి భారీ స్పందన వస్తోందని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 1.85 కోట్ల ట్రాఫిక్ చలాన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు. ట్రాఫిక్ చలాన్ల ద్వారా వాహనదారులు రూ.190 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీ చలాన్ల గడువు ఉందని, గడువును పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై జరిమానా విధిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News