Thursday, August 29, 2024

మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్లలో ఆ రైళ్లు ఇక ఆగవు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎల్లుండి నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోనున్నాయి. ఈ మూడు స్టాప్‌లను ఎత్తివేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణకు ముందు ఈ మూడు స్టేషన్లలో రైళ్లు ఆగేవి. అయితే కరోనా నేపథ్యంలో రైల్వే శాఖ ఈ స్టాపులను ఎత్తివేసింది. దాంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

స్టాపుల ఎత్తివేతతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అప్పటి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రైల్వే బోర్డు అధికారులను కలిసి విన్నవించడంతో ఏడాది క్రితం మళ్లీ ఆయా రైళ్లకు స్టాపులు ఏర్పాటు చేశారు. ఏడాది పాటు మాత్రమే అక్కడ రైళ్లను ఆపాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ గడువు జులై 19తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ మూడు రైళ్లు అక్కడ ఆగకుండానే వెళ్లనున్నాయి. విశాఖ ఎక్స్ ప్రెస్‌కు నల్గొండ స్టాప్‌ను కూడా ఎత్తివేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News