Wednesday, April 16, 2025

పూరి సినిమాలో కీలకపాత్రలో..

- Advertisement -
- Advertisement -

క్యారెక్టర్ కొత్తగా లేకపోతే అస్సలు సినిమా చేయదు టబు. అవకాశాలు లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను తప్ప, రొటీన్ పాత్రలు మాత్రం చేయనని, ఆమె ఇటీవల స్పష్టంగా ప్రకటించింది. అందుకే అల వైకుంఠపురములో సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు దాటుతోంది. కానీ ఇప్పటివరకు మరో సినిమాలో కనిపించలేదు టబు. ఇన్నాళ్లకు మరో సినిమాకు ఓకే చెప్పింది ఈ సీనియర్ నటి. డిఫరెంట్ స్టోరీ రాసుకొని విజయ్ సేతుపతిని ఒప్పించాడు పూరి జగన్నాధ్.

దర్శకత్వం వహించడంతో పాటు, చార్మితో కలిసి ఆ సినిమాను నిర్మించబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం టబును అనుకుంటున్నారు. టబు కీలకపాత్రలో కనిపించనున్నారట. ఇందులో ఆమెది పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని.. ఈ పాత్ర కోసం పూరి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారని టాక్. స్క్రిప్ట్ నచ్చడంతో టబు సైతం ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలుచేస్తూ బిజీగా ఉంది టబు. చాలా కాలం తర్వాత ఇప్పుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాతో సౌత్ సినిమాలో చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News