Tuesday, September 10, 2024

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్…. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. కెజియఫ్, సలార్ చిత్రాల తర్వాత నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అనే వర్కిం గ్ టైటిల్‌ను పెట్టారు. శుక్రవారం ఈ చిత్రాన్ని లాం ఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ మూ వీ పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అతని కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అభిమానులకు ఆనందాన్నిచ్చేలా ‘ఎన్టీఆర్ నీల్’ ప్రాజెక్ట్‌ను జనవరి 9, 2026లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్న డ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందనుంది. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఎలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News