Sunday, September 22, 2024

దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్ లో దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం నెలకొంది. పాస్ లు ఇవ్వడం లోశ్రేయాస్ మీడియా వైఫల్యమైంది . శ్రేయాస్ మీడియా కేపాసిటీ కి మించి పాస్ లు ఇచ్చింది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరుచుకొని ఆడిటోరియం లోపలికి దూసుకువచ్చారు. ఈ క్రమంలో  పలువురు  గాయపడ్డారు.అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. కేపాసిటీ కి మించి పాస్ లు ఇచ్చిన శ్రేయాస్ మీడియా పై కేసు నమోదు చేయాలనీ అభిమానులు డిమాండ్ చేశారు.భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News