కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, స్టార్ హీరో ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాపై తరచుగా పలు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ తొలి షెడ్యూల్లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని.. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెడతారని సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేక సెట్ను రెడీ చేస్తున్నారు.
ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నానని తెలిపారు.