Tuesday, March 18, 2025

సూర్యాపేటలో కాంగ్రెస్ నేతను గొడ్డళ్లతో నరికి చంపారు

- Advertisement -
- Advertisement -

నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేతను దారుణంగా హత్య చేశారు. మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్ (61) ను దుండగులు గొడ్డళ్లతో నరికి చంపారు.  పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా చక్రయ్య గౌడ్ పై మూకుమ్మడిగా మారణాయుధాలతో దుండగులు దాడి చేశాడు. కొన ఊపిరితో ఉన్న చక్రయ్య గౌడ్ ను గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చక్రయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News