మన తెలంగాణ/హైదరాబాద్ : పోలవరం ప్రా జెక్టు ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయాలని, ముంపు, బ్యాక్ వాటర్స్ ప్రభావంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలవ రం ప్రాజెక్టు అథారిటీని కోరింది. గత ఏడాది వ రదల ప్రభావంతో ముంపునకు గురైన నేపథ్యం లో అధ్యయనం సమగ్రంగా జరగాలని తెలంగా ణ ఈఎన్సీ అనిల్ కుమార్ కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాద్లోని సెంట్రల్ వాటర్ కమిటీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం భేటీ అయింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్, ఏపీకి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు భేటీలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు వం టి తదితర అంశాలపై సమావేశంలో చర్చించిన ట్లు సమాచారం. కొత్తగా సర్వే అవసరం లేదని, గతంలో ఉన్న వివరాలు సరిపోతాయని ఏపీ చీఫ్ ఇంజినీర్లు వాదించగా సంయుక్త సర్వే చే యాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్ణయించింది. తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తిం చే అంశం, పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో
తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను తెలంగాణ అధికారులు మరోమారు ఈ భేటీలో లేవనెత్తారు. పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం గురించి సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. కిన్నెరసాని, ముర్రేడువాగు, ఇతర ప్రవాహాల చర్యల గురించి ప్రస్తావించారు. ఖమ్మం పట్టణం, భద్రాచలం పట్టణాలపై పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం, రామాలయం వద్ద నీటిమట్టం, మణుగూరు భారజల ప్లాంట్ వద్ద వాటర్ లెవెల్స్ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులు మరోసారి అథారిటీని కోరారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుందనే విషయాలపై స్పష్టత రావాలని అథారిటీని తెలంగాణ అధికారులు కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ సీఈలు సుగుణాకర్, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.