- Advertisement -
తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ మూవీపై ఆసక్తిని పెంచింది. తాజాగా ముంబైలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది ట్రైలర్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహతోపాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -