- Advertisement -
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి నుంచి ఖైదీలు పరారైన సుందర్ను శనివారం నాడు బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు ఖైదీల పరారైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే వారికోసం గాలించిన పోలీసులు శనివారం నాడు పురోగతి సాధించారు. ఆగస్టు 27న గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు చర్లపల్లి జైలు ఖైదీలు పరారయ్యారు. ఓ ఖైదీ సోమ సుందర్ను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమ సుందర్ దగ్గర తొమ్మిది బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ఖైదీలు జావిద్, అర్భాస్, నరసింహ గుల్బర్గాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఖైదీల కోసం ప్రత్యేక పోలీసు బృందం కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు.
one arrested in prisoners escape from gandhi
- Advertisement -