- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై రెండో సీరో సర్వేను ఫలితాలను ఐసిఎంఆర్ మంగళవారం విడుదల చేసింది. ప్రతి పదిహేను మందిలో ఒకరికి కరోనా సోకినట్టు సిరో సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ఐసిఎంఆర్ తెలిపింది. రానున్న సీతాకాలం, ఇతర పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా రికవరీ రేటులో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి 51లక్షల మందికి పైగా కోలుకున్నారని, ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్ లో తక్కువని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ లో 2.97 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
One in every 15 exposed to virus by Aug says ICMR
- Advertisement -