Sunday, September 22, 2024

కుత్బుల్లాపూర్ లో రెండు బైకులు ఢీ… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసి కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రెండు బైకులు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరోకరికి గాయాలయ్యాయి. సమాచారం అదుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News