Saturday, February 22, 2025

సహ విద్యార్థిని హత్య చేసిన ఆరో తరగతి కుర్రాడు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి విద్యార్థిపై ఆరో తరగతి కుర్రాడు దాడి చేయడంతో సదరు బాలుడు చనిపోయిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్రహమ్ పూరిలోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు(14), ఆరో తరగతి చదువుతున్న బాలుడికి(12) మధ్య చిన్న గొడవ జరిగింది. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో 14 ఏళ్ల బాలుడి ముఖంపై 12 ఏళ్ల బాలుడు పిడిగుద్దులు కురుపించడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని జెపిసి ఆస్పత్రికి తరలించారు. ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారడంతో అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News