Friday, August 30, 2024

2025 డిసెంబర్ నాటికి పాలమూరు ప్రాజెక్టుల పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి నీటి పారుదల శాఖా రూట్ మ్యాప్ రూపొందించుకుందని రాష్ట్ర నీటి పారుదల ,పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మహబూబ్‌నగర్ పర్యటనలో భా గంగా ఇచ్చిన హామీ మేరకు 2025 డిసెంబర్ నాటికి ఆ జి ల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రా జెక్ట్‌ల పురోగతి తో పాటు నిర్మించాల్సిన ప్రాజెక్టుల పై బుధవా రం జలసౌద లో నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖా కార్యద ర్శి రాహుల్ బొజ్జ,అదనపు కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పా టిల్,నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యా దాస్,ఇ యన్ సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పా ల్గొన్నారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్,ఆర్ బి ఎల్ ఐ యస్,జే. ఎన్.ఎల్.ఐ .యస్,డిండి ఎల్‌ఐయస్,ఏ.యం.ఆర్ యస్ ఎల్ బి సి , నెట్టెంపాడు, భీమా,కల్వకుర్తి ఎల్ ఐ సి లతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, నిల్వాయి ప్రాజెక్ట్,పాలెం వాగు, మత్తడి వాగు,యస్.ఆర్‌యస్.పి ఫెస్2,చనాకా కోరాట, లోయర్ పెన్ గంగా, దేవాదుల ,మోదీ కుంటవాగు,యస్. వై. పి జే సి ఆర్ డి ఎల్ ఐ యస్, సీతారామ ఎల్ ఐ యస్ లపై స మగ్రమైన సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీటిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలో ని ప్రాజెక్ట్ లతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, మోదీకుంట,లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీ పాద ఎల్లంపల్లి,జేసిఆర్‌డిఎల్‌యస్ తదితరాలు పూర్తి చే సేందుకు 8,000 కోట్ల పైచిలుకు ఖర్చు అవుతుందన్న అంచనాకు అధికారులు వచ్చారన్నారు.

అయితే అదే సమయంలో 2025 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలన్న నిర్దేశిత లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకున్న తాము నీటి పారుదల శాఖకు అదనంగా మరో రూ. 11 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆర్థిక శాఖాకు పంపాలని నిర్ణయించామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ. 28,000 కోట్లు నీటి పారుదల శాఖాకు కేటాయించగా, అందులో గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్మాణాల పేరుతో చేసిన అప్పులకు కడుతున్న వడ్డియే రూ. 18,000 కోట్లు అని, మరో రెండు వేల కోట్లు జీత భత్యాలకే ఖర్చు అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్ ను సమీకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరు లక్షల పై చిలుకు ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.అందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను ఏ,బి,సి కేటగిరీలుగా విభజించామన్నారు.

ఇప్పటికే పూర్తి కావొచ్చిన వాటిని ఏ కేటగిరీలో, ఆ తరువాత బి,ఆ తరువాత సి లుగా విభజించడం జరిగిందన్నారు. ఏ కేటగిరీలో రూ. 240.66 కోట్లతో 47,882 ఎకరాల ఆయకట్టును సేద్యం లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా నిర్మితమౌతున్న ప్రాజెక్టులకు సుమారు రూ.7,500 కోట్ల పై చిలుకు అంచనా వ్యయంతో 5,84,770 ఎకరాల ఆయకట్టు భూమిని సేద్యం లోకి తీసుక రానున్నట్లు ఆయన తెలిపారు. అదే విదంగా నిర్మల్ జిల్లా సదర్‌మట్ ప్రాజెక్టు ను ఈ నెల చివరి నాటికి,ఖమ్మం జిల్లాలో రాజీవ్ కెనాల్(సీతారాం ప్రాజెక్ట్ )ను ఆగస్టు 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.నదుల అనుసంధానం ప్రతిపాదనలను పరిశీలన చేస్తామన్నారు.

త్వరలో ప్రమోషన్లు..బదిలీలు:
నీటిపారుదల శాఖను పునర్‌వ్యస్థీకరించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు త్వరలోనే పచ్చజెండా వూపనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ఉద్యోగుల బదిలీలకు కూడా ఆదేశాలిచ్చామన్నారు. కోర్టులో ఉన్న పలు కేసులకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాల మేరకు ముందుకు పోనున్నట్టు తెలిపారు
మేడిగడ్డపై 20న ఢిల్లీలో సమావేశం:
మేడిగడ్డ బ్యారేజికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలను కూడా సమీక్షించామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 20న ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సమావేశం ఉందన్నారు.ఈ సమావేశానికి తనతోపాటుగా నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చిస్తామన్నారు. ఈ వర్షాకాలంలో గోదావరి నదికి వచ్చే వరదల నుంచి మేడిగడ్డతోపాటు అన్నారం , సుందిళ్ల బ్యారేజిలను ఎవిధంగా కాపాడుకోవాలో ఈ సామవేశంలో చర్చించి నిర్ణయించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News